News April 25, 2024
దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేశారు: ప్రియాంకా గాంధీ
మహిళల మంగళ సూత్రాలనూ కాంగ్రెస్ వదలదంటూ మోదీ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ స్పందించారు. బెంగళూరులో మాట్లాడుతూ.. ‘యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళమిచ్చారు. మా అమ్మ సోనియా దేశం కోసం తాళిబొట్టును త్యాగం చేశారు(రాజీవ్ గాంధీని ఉద్దేశించి)’ అని పేర్కొన్నారు. దేశంలో INC 55 ఏళ్లు అధికారంలో ఉందని, ప్రజల బంగారాన్ని, తాళి బొట్లను ఎప్పుడైనా లాక్కుందా? అని ప్రశ్నించారు.
Similar News
News February 5, 2025
SWIGGY నికర నష్టం రూ.799 కోట్లు
FY25 మూడో త్రైమాసికంలో ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది ఇదే టైంలో రూ.574 కోట్లు నష్టం చవిచూడగా ఈసారి నికర నష్టం రూ.799 కోట్లకు చేరుకుంది. FY25 Q3లో రూ.3,700 కోట్లుగా ఉన్న ఖర్చులు ఇప్పుడు రూ.4,898 కోట్లకు పెరగడమే నష్టాలకు కారణమని సమాచారం. ఆపరేషన్స్ రెవెన్యూ మాత్రం 31% వృద్ధిరేటుతో రూ.3049 కోట్ల నుంచి రూ.3993 కోట్లకు పెరిగింది. టాప్లైన్ సైతం 11% గ్రోత్ నమోదు చేసింది.
News February 5, 2025
‘మిర్రర్ హ్యాండ్’ సిండ్రోమ్ గురించి తెలుసా?
ఎవరి చేయికైనా ఐదు వేళ్లు ఉండటం సహజం. కొందరికి 6 కూడా ఉంటుంటాయి. అయితే, ‘మిర్రర్ హ్యాండ్’ సిండ్రోమ్ సోకిన వారికి చేతికి ఇరువైపులా ఒకే విధంగా వేళ్లుంటాయి. ఈ అరుదైన వ్యాధి వల్ల ఒక్క హ్యాండ్కు 8 ఫింగర్స్ ఉంటాయి. బొటనవేలు ఉండదు. దీనికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ అల్ట్రాసౌండ్ ద్వారా జననానికి ముందే గుర్తించవచ్చు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నార్మల్గా మార్చేయవచ్చు.
News February 5, 2025
నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత ఏమన్నారంటే?
మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత స్పందించారు. చైతూకు శోభితతో పెళ్లి అయిన నేపథ్యంలో అసూయ పడుతున్నారా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ‘లేదు. నా జీవితంలో అసూయకు చోటు లేదు. చెడుకు మూల కారణం అసూయ అని భావిస్తాను. నా జీవితంలో దాన్ని భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అలాంటి వాటి గురించి ఆలోచించను’ అని సమంత అన్నారు. శోభితను నాగ చైతన్య గతేడాది DECలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.