News April 25, 2024
నేటితో సీఎం జగన్ బస్సు యాత్ర ముగింపు
AP: సీఎం జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేడు ముగియనుంది. టెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా గత నెల 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో యాత్ర మొదలైంది. ఇటు పులివెందులలో ఈ నెల 25న జగన్ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
ఫంక్షన్కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
విజయ్లో నాకు నచ్చనిది అదే: త్రిష
దళపతి విజయ్ షూటింగ్లో ఒక గోడ పక్కన మౌనంగా కూర్చొని ఉంటారని హీరోయిన్ త్రిష అన్నారు. ఆయనలో తనకు అదే నచ్చదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయ్కి అది మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఏమైనా విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని చెప్పుకొచ్చారు. మరో నటుడు శింబు తనను షూటింగ్ సమయంలో టీజ్ చేస్తారని పేర్కొన్నారు. విజయ్, త్రిష జంటగా లియో, గిల్లితో పాటు పలు చిత్రాల్లో నటించారు.
News February 5, 2025
పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.