News April 25, 2024
నల్గొండ: ఓటరు అండ ఎవరికి?

TG: ఒకప్పుడు సీపీఐకి, ఇప్పుడు కాంగ్రెస్కు కంచుకోట లాంటి లోక్సభ నియోజకవర్గం నల్గొండ. BRS, BJP ఒక్కసారీ గెలవని సెగ్మెంట్ కూడా ఇదే. ఈసారి రఘువీర్ రెడ్డి(INC), కంచర్ల కృష్ణారెడ్డి(BRS), శానంపూడి సైదిరెడ్డి(BJP) పోటీ చేస్తున్నారు. పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని BJP, BRS ఆరాటపడుతున్నాయి. ఇక్కడ INC, CPI చెరో 7సార్లు, TDP 2సార్లు, తెలంగాణ ప్రజా సమితి, PDF చెరోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 22, 2026
ఆ 2 గంటలు చాలా ముఖ్యం!

<<19446288>>సైబర్<<>> మోసాలకు గురైతే ఆందోళన చెందకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే <
News March 22, 2026
TN పడవలు రాకుండా చూడండి.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

AP: తమిళనాడు మత్స్యకార పడవలు ఏపీ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాయని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలకు రాష్ట్ర మత్స్య శాఖ లేఖ రాసింది. దీని వల్ల 162 తీర గ్రామాలకు చెందిన స్థానిక మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంది. TN పడవల రాక ఇక్కడి వారి జీవనానికి ముప్పుగా మారిందని తెలిపింది. త్వరగా స్పందించి అవి AP సముద్ర జలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది.
News March 22, 2026
సమ్మర్లో చికెన్ తింటున్నారా?

సమ్మర్లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.


