News January 4, 2026
ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓటర్ల జాబితా ఇదే.!

☆ మధిర 22 వార్డుల్లో మొత్తం ఓటర్లు 25,679 ఉండగా.. పురుషులు-12251 మహిళలు-13,424 ఇతరులు-4, ☆సత్తుపల్లి 23 వార్డుల్లో మొత్తం ఓటర్లు 28,411.. ఇందులో పురుషులు-13,426 మహిళలు-14,970 ఇతరులు-15, ☆వైరా(20) మొత్తం ఓటర్లు 24,689 పురుషులు-11,696 మహిళలు-12,991 ఇతరులు-2 ☆ఏదులాపురం(32) మొత్తం ఓటర్లు 45,256 పురుషులు-21,742 మహిళలు-23,511 ఇతరులు-3 ☆కల్లూరు(20) మొత్తం ఓటర్లు 18,866 పురుషులు-9081, మహిళలు-9785 ఉన్నారు.
Similar News
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: ఖమ్మం సీపీ

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రస్తుతం BNSS 163 అమలులో ఉన్నందున.. విజయోత్సవ వేడుకలు, బైక్ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, డీజేల వాడకంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమించి గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని సీపీ కోరారు.
News February 13, 2026
ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.
News February 13, 2026
ధర్మంపై అధర్మమే గెలిచింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ధర్మంపై అధర్మమే విజయం సాధించిందని BJP జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలే పైచేయి సాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం “ధనబలంతో కూడిన రాజకీయాలదే తప్ప, ప్రజల నిజమైన తీర్పు కాదు. ప్రజలు ఈ విషయాన్ని త్వరలోనే గ్రహిస్తారు” అని అభిప్రాయపడ్డారు.


