News January 4, 2026

కామారెడ్డి జిల్లాలో మళ్లీ పెరుగుతున్న చలి ప్రభావం

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. లచ్చపేట 13°C, గాంధారి 13.9, దోమకొండ 14, ఎల్పుగొండ 14.3, ఇసాయిపేట 14.5, భిక్కనూరు 14.7, జుక్కల్ 14.9°C ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజులుగా పొగమంచు అధికంగా ఏర్పడి, చలి తగ్గగా, తిరిగి చలి ప్రభావం ఎక్కువవుతుందని తెలిపారు.

Similar News

News February 4, 2026

ధర్మపురి మున్సిపల్ సమరం.. BRS హోరాహోరీ

image

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి 15 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టింది. 1వ వార్డులో పేరుమండ్ల ఎల్ల గౌడ్, 2- నక్క రమక్క, 3- మాధ్వాచారి కపిల్, 4- బాకీ చంద్రశేఖర్, 5- చుక్క విజయ, 6- మామిడి శివసాయి, 7- గుర్రాల సుధాకర్, 8- అనంతుల విజయ లక్ష్మి, 9- జెట్టి విజయలక్ష్మి, 10- సంగి సతెమ్మ, 11- అల్లాల వెన్నెల, 12- అనుషా తిరుమండసు, 13- బండారి రంజిత్, 14- సంగి రేఖ, 15- వోడ్నాల ఉమాలక్ష్మి.

News February 4, 2026

అపోహలు వీడండి.. ఆరోగ్యం కాపాడుకోండి!

image

ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90% క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పీచు పదార్థాలు తింటూ రోజూ వ్యాయామం చేస్తే వ్యాధి ముప్పు తగ్గుతుందంటున్నారు. ‘శరీరంలో గడ్డలు, మచ్చలు, దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధారణే మన ప్రాణాలను కాపాడుతుంది’ అని సూచిస్తున్నారు. నేడు వరల్డ్ క్యాన్సర్ డే.

News February 4, 2026

ఈనెల 9 నుంచి FA-4 & ఫ్రీ ఫైనల్ పరీక్షలు: DEO

image

జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో DEO ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. 1-9వ తరగతి వరకు FA-4 పరీక్షలు ఈనెల 9 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 9 నుంచి 19 వరకు జరుగుతాయన్నారు. ప్రశ్న పత్రాలను జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాల MRCలలో భద్రపరుస్తున్నామన్నారు.