News April 25, 2024

శ్రీకాకుళం: సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సీఎం జగన్ పర్యటన వివరాలు మంగళవారం వెలువడ్డాయి. సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాన్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు టెక్కలి మండలం అక్కవరం గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం పాల్గొనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

Similar News

News September 11, 2025

ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News September 11, 2025

నేపాల్‌లో తెలుగువారి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

image

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.

News September 11, 2025

గోకర్ణపురం పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

కంచిలి మండలం గోకర్ణపురం ఎంపీపీ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. పాఠశాలలో రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో ‘యూ’ ఆకృతిలో చేపట్టిన బోధన విధానంపై ఆరా తీశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ-1 ఎస్ శివరాం ప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.