News January 4, 2026

కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడు ఈయనే.!

image

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కడప జిల్లా భోధనేతర సిబ్బంది అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ట్రెజరర్‌గా రాజేశ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలోని బోధ నేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కలెక్టర్

image

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. కడప జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

News January 14, 2026

కడప జిల్లా TDP MLAకి బెదిరింపులు

image

మైదుకూరు MLA సుధాకర్ యాదవ్‌‌తో పాటు అతని కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను బెదిరించిన కేసులో ముంబయికి చెందిన నిందితుడు రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. RTI కార్యకర్తనని, ఆస్తులను జప్తు చేస్తానని ఈ-మెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. రూ.10 కోట్లు ఇస్తే వదిలి పెడతానని MPని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు దక్షిణ ముంబయిలో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు.

News January 14, 2026

కడప: 68,207 హెక్టార్లలో పప్పు శనగ సాగు

image

కడప జిల్లాలో ప్రస్తుత రబీలో 68,207 హెక్టార్లలో పప్పు శనగ పంటను రైతులు సాగు చేశారు. వాయుగుండం ప్రభావంతో ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పూత, పిందె దశలోని శనగ పంటకు నష్టం జరిగిందని రైతుల ఆందోళన చెందుతున్నారు. శనగ మొక్కలో కీలకమైన పులుసు వర్షానికి కరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో కురిసిన వర్షానికి పులుసు రాలిపోయేంతగా నష్టం లేదని MAO వరహరికుమార్ తెలిపారు.