News April 25, 2024
గండీడ్: పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News January 20, 2026
మహబూబ్నగర్లో అగ్నిప్రమాదం

మహబూబ్నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
News January 20, 2026
జిల్లాలో చలి పంజా.. రాజాపూర్లో 11.8 డిగ్రీలు

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
News January 19, 2026
మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


