News January 5, 2026
కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News February 3, 2026
రాష్ట్రస్థాయిలో కృష్ణా జిల్లా విద్యార్థి ప్రతిభ

కృష్ణ జిల్లా గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని అమీనా తబుసం రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. నెల్లూరులోని ఎస్వీ సుబ్బారెడ్డి స్టేడియంలో జనవరి 27న నిర్వహించిన 8వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 400 మీటర్ల పరుగు పందెంలో ఆమె ప్రథమ స్థానం సాధించింది. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు.
News February 3, 2026
పరిశ్రమల స్థాపనలో సంస్థాగత ఇబ్బందులను అధిగమించండి: కలెక్టర్

పరిశ్రమల స్థాపనలో సంస్థాగతంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రత్యేక అధికారులతో సమావేశమైన ఆయన పరిశ్రమల స్థాపనపై చర్చించారు. జిల్లాలో 237 పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చినప్పటికీ సంస్థాగతంగా నెలకొన్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
News February 2, 2026
కృష్ణా: ‘విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి’

పెనమలూరు నియోజకవర్గం పోరంకి BJR నగర్లోని చైతన్య విద్యా సంస్థల్లో పవన్ అనే విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరిగిన PGRSలో జిల్లా అధ్యక్షులు పూజిత, కార్యదర్శి సమరం కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. తోటి విద్యార్థుల ముందు పవన్ను ప్రిన్సిపల్ అవమానకరంగా మాట్లాడినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని SFI నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.


