News April 25, 2024
నిడదవోలు: గెలుపు ముంగిట నిలిచేదెవరు?

AP: కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు(తూర్పుగోదావరి) 2008లో కొత్త సెగ్మెంట్గా ఏర్పడింది. 2009, 14లో బూరుగుపల్లి శేషారావు(TDP), 2019లో శ్రీనివాసనాయుడు(YCP) గెలిచారు. ఈసారి కూడా YCP నుంచి ఆయనే బరిలో దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2019లో YCPకి 81వేల ఓట్లు రాగా, TDP, JSPకి కలిపి 82,386 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 16, 2026
నితీశ్పై తీవ్ర విమర్శలు.. తిప్పికొట్టిన విహారి

భారత జట్టుకు ఆల్రౌండర్గా పనికిరాడంటూ నితీశ్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై హనుమ విహారి Xలో స్పందించారు. ’22 ఏళ్ల వయసులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేసే క్రికెటర్లు దేశంలో ఎవరైనా ఉన్నారా? నితీశ్ ఇప్పటివరకు 3 వన్డేల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 T20ల్లో 3W, 4th సీమర్గా 10 టెస్టుల్లో 8W పడగొట్టాడు. మెల్బోర్న్లో సెంచరీ చేశాడు. అది ఇప్పటికీ చాలా మందికి నెరవేరని కల’ అంటూ నితీశ్కు మద్దతునిచ్చారు.
News January 15, 2026
కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దా? దీని వెనుక ఉద్దేశం?

కనుమ రోజున ప్రయాణాలు చేయొద్దనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రోజును పశువుల పండుగగా జరుపుతారు. పంటల సాగులో సాయపడిన పశువులను పూజిస్తారు. అయితే పూర్వం ఎడ్ల బండ్లపై ప్రయాణాలు చేసే వారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ప్రయాణాలు వద్దని చెప్పేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ నియమం వల్ల కుటుంబమంతా కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం ఉంటుందంటున్నారు.
News January 15, 2026
సూర్యపై కామెంట్స్.. నటిపై రూ.100 కోట్ల దావా

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్ చేస్తున్నాడన్న నటి <<18721618>>ఖుషీ<<>> ముఖర్జీపై SKY అభిమాని అన్సారీ చర్యలకు దిగారు. నటి వ్యాఖ్యలను ఖండిస్తూ రూ.100 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశారు. నటికి సూర్య కుమార్ మెసేజులు చేశారనడం పూర్తిగా తప్పని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఖుషీకి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.


