News April 25, 2024
నిడదవోలు: గెలుపు ముంగిట నిలిచేదెవరు?

AP: కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు(తూర్పుగోదావరి) 2008లో కొత్త సెగ్మెంట్గా ఏర్పడింది. 2009, 14లో బూరుగుపల్లి శేషారావు(TDP), 2019లో శ్రీనివాసనాయుడు(YCP) గెలిచారు. ఈసారి కూడా YCP నుంచి ఆయనే బరిలో దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2019లో YCPకి 81వేల ఓట్లు రాగా, TDP, JSPకి కలిపి 82,386 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 18, 2026
జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.
News January 18, 2026
మెస్రం వంశీయుల ఆచారాలు

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.
News January 18, 2026
మెస్రం వంశీయుల ఆచారాలు

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.


