News January 5, 2026

నిర్మల్: పుర పోరు.. సిద్ధమవుతున్న పార్టీలు

image

నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తులు మొదలుపెట్టాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఛైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఆయా పార్టీల అధిష్ఠానాలు వ్యూహరచన చేస్తున్నాయి.

Similar News

News February 21, 2026

PGRS ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి: GNT ఎస్పీ

image

గుంటూరు జిల్లా పో‌‌లీస్ కార్యాలయంలో శనివారం జనవరి నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పైసత్వరమే చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించితప్పించుకొనితిరుగుతున్న నేరస్థులను గుర్తించాలన్నారు.

News February 21, 2026

ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక చేయూత: కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

image

జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ తెలిపారు. శనివారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు 100 శాతం సబ్సిడీతో పునరావాస పథకం కింద అందజేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

News February 21, 2026

ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 324 రోజుల్లోనే 250 మిలియన్ టన్నుల సరకు రవాణాను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి రైల్వే జోన్‌గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 31 రోజుల ముందే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు రవాణా ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి.