News April 25, 2024

మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు కోసం కుమార్తెల ప్రచారం

image

అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలుపు కోసం ఆయన కుమార్తెలు కృష్ణప్రభ, అవనిజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు ఉన్నారు.

Similar News

News March 10, 2026

చల్లపల్లిలో బాలిక ఆత్మహత్య

image

చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.

News March 9, 2026

EVM గోడౌన్‌ను తనిఖీ చేసిన కృష్ణా కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్‌ను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీలు తీయించారు. భద్రతా ప్రమాణాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.