News January 5, 2026
HYD: ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్

నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద సాయంత్రం నుంచి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. KBR పార్క్ నుంచి పంజాగుట్ట రూట్, ప్రజాభవన్ నుంచి బేగంపేట, మాసబ్ట్యాంక్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ PS రూట్లో వాహనాల కదలిక మందగించింది. పీక్ అవర్స్ కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణం ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
SHARE IT
Similar News
News February 22, 2026
పరీక్షల వేళ డీజేలకు నో ఎంట్రీ.. ఎస్పీ హెచ్చరిక

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఆటంకం కలగకుండా ధ్వని కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్సులు, స్టేజ్ ప్రోగ్రాములు నిర్వహించరాదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
News February 22, 2026
రాజమండ్రి: ఎస్పీ వార్నింగ్.. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

జిల్లాలో రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు తమ అరాచకాలను మానుకోవాలని, లేనిపక్షంలో వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
News February 22, 2026
భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం MOU

AP: భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.


