News January 5, 2026
రైతులకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తున్నాం: ములుగు S.E

రైతుల వ్యవసాయ అవసరాల కోసం మెరుగైన విద్యుత్తును అందిస్తున్నామని వారు ఇబ్బందులను తొలగిస్తున్నామని ఎన్పీడీసీఎల్ ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆనందం తెలిపారు. విద్యుత్ అధికారుల పొలం బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. 152 ఒరిగిన స్తంభాలను సరి చేశామన్నారు. 142 చోట్ల లూస్ లైన్లకు మరమ్మతు చేసి 188 మద్య స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News January 14, 2026
బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

బంగ్లాదేశ్లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.
News January 14, 2026
HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..
News January 14, 2026
భద్రాద్రి: పండుగ వేళ విషాదం.. బస్సు ఢీకొని మహిళ మృతి

చండ్రుగొండ మండల కేంద్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఓ మహిళను భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంక్రాంతి సంబరాల్లో ఉండాల్సిన కుటుంబంలో ఈ ఘటనతో పెను విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.


