News April 25, 2024
తెలంగాణలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారు

TG: రాష్ట్రంలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30న ఆందోల్లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. ఇక వచ్చే నెల 3,4 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ స్థానాలకు కలుపుతూ మరో సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజు నారాయణపేట, వికారాబాద్లో జరిగే సభల్లో ప్రధాని పాల్గొంటారని పీఎంవో వర్గాలు తెలిపాయి.
Similar News
News March 10, 2026
యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

ఇరాన్ యుద్ధం సెగ పాక్కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.
News March 9, 2026
నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.
News March 9, 2026
‘కల్కి’ కోసం కమల్ హాసన్కు రోజుకు ₹15 కోట్లు?

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


