News January 7, 2026
నెల్లూరు: మత్స్యకారులకు నావిగేషన్ పరికరాలు

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు భద్రతతో పాటు చేపలు ఉండే ప్రాంతాన్ని పసిగట్టే నావిగేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. జిల్లాలో 3వేల బోట్లకు వీటిని అమర్చనుంది. నెల్లూరులోని జిల్లా మత్స్య శాఖ ఆఫీసుకు ఈ పరికరాలు వచ్చాయి. వీటిని బోట్లకు అమర్చడంతో మత్స్సకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Similar News
News February 21, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 21, 2026
నెల్లూరులో 20వేల మంది ఎదురుచూపులు..!

నెల్లూరు జిల్లాలో 29లక్షల మంది జనాభాలో 30,5640 మంది పెన్షనర్లు. వీరికి నెలకు రూ.127 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. కనీసం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారనే లెక్కలూ సేకరించలేదు. వితంతు పెన్షన్లూ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్స్ ఉన్నవారితో పాటు అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో 20వేల మంది ఎదురు చూస్తున్నారు.
News February 21, 2026
నెల్లూరులో 20వేల మంది ఎదురుచూపులు..!

నెల్లూరు జిల్లాలో 29లక్షల మంది జనాభాలో 30,5640 మంది పెన్షనర్లు. వీరికి నెలకు రూ.127 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. కనీసం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారనే లెక్కలూ సేకరించలేదు. వితంతు పెన్షన్లూ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్స్ ఉన్నవారితో పాటు అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో 20వేల మంది ఎదురు చూస్తున్నారు.


