News April 25, 2024
వెల్త్ సర్వేపై రాహుల్ యూటర్న్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేపడతామన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. ‘మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకోవాలని అన్నాను. దీనికే దేశాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర అంటూ ప్రధాని మోదీ, BJP ఆరోపిస్తున్నాయి’ అని తెలిపారు. కాగా ఈనెల 7న హైదరాబాద్లో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేస్తామని ప్రకటించారు.
Similar News
News November 5, 2025
నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.
News November 5, 2025
సినిమా అప్డేట్స్

* తాను నటిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఓ పాట పాడారు. దీన్ని ఈ నెల మూడో వారంలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం JAN 14న విడుదల కానుంది.
* సుధా కొంగర డైరెక్షన్లో శివకార్తికేయన్ నటిస్తోన్న ‘పరాశక్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజవనుంది.
* తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిరాధారమని, ఎలాంటి చిత్రాలనూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.
News November 5, 2025
APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<


