News January 7, 2026
వనపర్తి, పెబ్బేర్ మున్సిపాలిటీలకు రూ.3.73 కోట్లు

వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.3.73 కోట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంజూరు చేయించారని స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నిధులతోవీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలను నిర్మిస్తారని వారు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 14, 2026
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి: CM రేవంత్

TG: మున్సిపల్ ఫలితాలపై మంత్రులతో CM రేవంత్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నికైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు.
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.
News February 14, 2026
‘శివ లింగం’ అంటే ఏంటంటే?

పరమశివుని ఆరాధనలో ‘శివలింగం’ అత్యంత ముఖ్యమైనది. శాస్త్రాల ప్రకారం శివలింగం అంటే భగవంతుని ఒక రూపం లేదా ప్రతీక అని అర్థం. కంటికి కనిపించని ఆ పరమేశ్వరుడిని భక్తితో ఒక శిలా లేదా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, స్థితి, లయకారుడైన ఆ దేవుని అనుగ్రహం పొందేందుకు ‘శివలింగారాధన’ ఒక గొప్ప మార్గం. ఈ ఆరాధన ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతను, శివుడి అనుగ్రహాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు.


