News January 7, 2026
విశాఖ: భర్త మిస్సింగ్.. భార్యే చంపేసిందా?

బక్కన్నపాలెం కే2 కాలనీలో అల్లాడ నాగరాజు అదృశ్యం కేసు మిస్టరీ కలకలం రేపుతోంది. గత నవంబర్లో భర్త నాగరాజు మిస్ అవగా DEC 9న భార్య రమ్య పీఎంపాలెం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నగలు తీసుకుని పరారయ్యాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయితే విచారణలో రమ్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. హత్యాకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2026
మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
News February 16, 2026
BIG BREAKING: కొత్తగూడెం మేయర్గా గణేష్ ఎన్నిక

కొత్తగూడెం మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్గా సుజాతనగర్ 21 డివిజన్ కార్పొరేటర్ మూడు గణేష్ను సీపీఐ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారికంగా సీపీఐ నేతలు మూడు గణేష్ ఎంపికపై వివరాలు వెల్లడించారు. కాగా ఉపమేయర్ పదవిని కాంగ్రెస్కు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.
News February 16, 2026
అనకాపల్లి: నిరంతరాయంగా 10th ప్రీ ఫైనల్ పరీక్షలు

పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయని DEO అప్పారావు నాయుడు తెలిపారు. ఈ నెల 9న తెలుగుతో మొదలైన ఈ పరీక్షలు సోషల్ స్టడీస్తో 17న ముగుస్తాతాయని సోమవారం తెలిపారు. శివరాత్రి జాగరాలు నేపథ్యంలో సోమవారం దాదాపుగా అన్ని పాఠశాలలూ లోకల్ హాలిడేని ప్రకటించాయి. అయినప్పటికీ సోమవారం షెడ్యూల్ ప్రకారం బయాలజీ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు.


