News January 7, 2026

NZB: పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బదిలీ

image

పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం DSOగా బదిలీ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డికి జిల్లా మేనేజర్‌‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీకాంత్ రెడ్డి బదిలీ కావడంతో కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Similar News

News January 12, 2026

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: సీఎం

image

TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్‌లో ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు.

News January 12, 2026

అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలి: JC

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు పరిష్కారం చూపాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News January 12, 2026

దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: రేవంత్

image

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ ప్రకటించారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థికసాయం అందిస్తామన్నారు. విద్య, ఉద్యోగాల భర్తీలో వారికి కోటాను కేటాయిస్తున్నట్లు ప్రజాభవన్‌లో ఓ కార్యక్రమంలో తెలిపారు. కుటుంబసభ్యుల్లా భరోసా కల్పిస్తూ వారికి రూ.50 కోట్లతో ఉపకరణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో ఎదగాలని పిలుపునిచ్చారు.