News April 25, 2024

కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌కు షాకిచ్చిన ఆర్బీఐ

image

మొబైల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయొద్దని పేర్కొంది. డేటా సెక్యూరిటీకి సంబంధించి సమస్యలను సమగ్రంగా, సకాలంలో పరిష్కరించకపోవడంతో 35A సెక్షన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం చర్యలు తీసుకుంది.

Similar News

News February 5, 2025

టెట్ ఫలితాలు వాయిదా

image

TG: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సి ఉండగా, MLC ఎన్నికల కోడ్‌తో వాయిదాపడ్డాయి. తొలుత ప్రకటించాలని భావించినా, టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో(HYD, రంగారెడ్డి, MBNR మినహా) MLC కోడ్ అమల్లో ఉంది.

News February 5, 2025

కుంభమేళాకు ఫ్రీ ట్రైన్, ఫ్రీ ఫుడ్.. ఎక్కడంటే!

image

మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు గోవా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌కు ఉచితంగా ప్రయాణించేందుకు 3 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. Feb 6, 13, 21 తేదీల్లో మడ్గాన్ నుంచి 8AMకు ఇవి బయల్దేరుతాయి. ప్రభుత్వమే ఫ్రీ భోజనం అందిస్తుంది. ప్రయాగకు వెళ్లాక మాత్రం బస, భోజనం భక్తులే చూసుకోవాలి. వెళ్లాక 24 గంటల్లో రిటర్న్ జర్నీ మొదలవుతుంది. మిగతా రాష్ట్రాలూ ఇలాంటి సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

News February 5, 2025

మహా కుంభమేళా: ప్రయాగ్‌రాజ్ చేరుకున్న మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే హెలీప్యాడ్ వద్దకు వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో మోదీ కుంభమేళా ప్రాంతానికి వెళ్తారు. త్రివేణీ సంగమ స్థలిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అలాగే హిందూ సంఘాలు, సాధుసంతులతో సమావేశమవుతారు.

error: Content is protected !!