News January 8, 2026
గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.
Similar News
News February 23, 2026
సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కొట్టివేత

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన <<19208192>>ఏకసభ్య కమిషన్ను<<>> సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. పరిపాలనా పరమైన లోపాల గుర్తింపునకు ఆ కమిషన్ను ఏర్పాటు చేశారని CJI ధర్మాసనం అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేయబోదని పేర్కొంది.
News February 23, 2026
భారీ స్కామ్.. IDFC షేర్లు ఢమాల్

చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల స్కామ్ వెలుగుచూడటంతో IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇవాళ భారీగా పతనమవుతున్నాయి. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకాలు చేపట్టారు. దీంతో గరిష్ఠంగా 20శాతం నష్టం చవిచూడగా తర్వాత కాస్త పుంజుకొని ప్రస్తుతం 16శాతం వద్ద కొనసాగుతోంది. హరియాణా ప్రభుత్వ విభాగం తమ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది.
News February 23, 2026
రాజమండ్రిలో కల్తీ పాలు.. సీఎం సమీక్ష

AP: రాజమండ్రిలో <<19213441>>కల్తీ పాల వ్యవహారంపై<<>> సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు అస్వస్థతకు గురవడం, మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని, ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని సూచించారు. ల్యాబ్లో పాల నమూనాలను పరీక్షించిన తర్వాత ఫలితాలను బట్టి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


