News January 8, 2026
‘మదన’పల్లె

మదనపల్లె మదనపడుతోంది. జిల్లా కేంద్రం అయినా.. అక్కడ జరుతున్న పరిణామాలు, వెలుగుచూస్తున్న ఘటనలతో కలవరపెడుతోంది. ఇప్పటికే కల్తీమద్యం తయారీతో జిల్లాకు ఒక మచ్చ ఏర్పడితే.. అక్కడే కడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడటంతో ఆ ప్రాంత పల్లెలు హడలెత్తారు. దీనికి తోడు జిల్లా ఆసుపత్రిలో నిర్వహణ లోపం, క్రైం రేట్లో టాప్లో నిలవడం, నిన్న ఏకంగా ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్తో మదనపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 17, 2026
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 17, 2026
ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
News January 17, 2026
మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన విషయం తెలిసిందే.


