News January 8, 2026
VZM: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో సుందరపేట సీహెచ్సీకి, డ్రైవర్ను కేంద్రాసుపత్రికి తరలించారు.
Similar News
News February 3, 2026
బలహీన పోలింగ్ బూత్లపై TDP ప్రత్యేక దృష్టి

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.
News February 3, 2026
నెల్లూరులో రాజమండ్రి గంజాయి స్మగ్లర్పై PD యాక్ట్

నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కేసుల్లో పలుమార్లు నిందితుడిగా ఉన్న రాజమండ్రికి చెందిన ప్రకాశ్పై PIT-NDPS చట్టం కింద PD యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ అజిత వేజండ్ల తెలిపారు. ఇప్పటికే పలు NDPS కేసుల్లో నమోదై ఉన్నప్పటికీ డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగించడంతో ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు.
News February 3, 2026
VZM: వివిధ శాఖల పనితీరుపై జేసీ అసంతృప్తి

PGRSకు వచ్చే వినతులను రెండు పూటలా లాగిన్లో తనిఖీ చేసి, గడువు లోపే పరిష్కరించాలని JC సేధు మాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ పిటిషన్లకు ఎమ్మార్వోలు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఐవీఆర్ఎస్లో కొన్ని శాఖలకు నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని, అన్నా కాంటీన్లు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, హెల్త్, ఇరిగేషన్ వంటి శాఖలు పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు.


