News January 8, 2026
రూ.4 వేల కోట్లతో వరంగల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం!

వరంగల్ మహానగరం వరద ముంపులు లేని ప్రాంతంగా మారబోతుంది. రూ.4 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి వారం రోజుల్లోపు టెండర్లు పిలవనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని, వారం రోజుల్లో టెండర్లు పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామన్నారు.
Similar News
News January 24, 2026
రెండేళ్లలో రూ.40 వేల కోట్ల రుణాలు: మంత్రి సీతక్క

రెండు సంవత్సరాలుగా రూ.40 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు. కెసముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు 68 లక్షలు అయ్యారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కేసముద్రం మహిళ సంఘాలకు 2 బస్సులు ఇస్తున్నామన్నారు.
News January 24, 2026
కర్నూలు రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రైల్వే స్టేషన్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందాలతో రైల్వే పార్శిల్ కార్యాలయం, వెయిటింగ్ హాలు, ప్లాట్ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలు ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలుగా పోలీసులు తెలిపారు.
News January 24, 2026
ఎన్నికల ముంగిట మున్సిపాల్టీలకు ₹1000 కోట్లు

TG: మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిలో కనీస మౌలిక వసతులను మెరుగుపర్చేలా చర్యలు చేపట్టింది. వీటికోసం అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో TUIFDC ద్వారా చేపట్టే పనులకోసం ₹1000 కోట్ల నిధులను రుణం కింద తీసుకుంటోంది. హడ్కో నుంచి సేకరిస్తున్న ఈ రుణంతో పనులు ప్రారంభించనున్నారు. కాగా ఈ రుణాన్ని నెలవారీ వడ్డీతో వాయిదాల రూపంలో ప్రభుత్వం హడ్కోకు చెల్లించనుంది.


