News January 8, 2026
మల్దకల్: మహిమాన్వితం ఆదిశిలా క్షేత్రం..!

మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందుతోంది. క్షేత్ర దైవం తిమ్మప్ప స్వామి కొలిచిన భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజుల్లుతున్నాడు. ఇక్కడి ఆలయం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. స్వామిని నడిగడ్డ ప్రజలు కలియుగ దైవంగా భావిస్తారు. ఏటా డిసెంబర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఒక పెద్ద శిలకు మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి, పశ్చిమ భాగాన ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశారు.
Similar News
News January 26, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, అన్ని మండలాల తహసిల్దార్ కార్యాలయాల్లో ఎమ్మార్వోలు, పోలీస్ స్టేషన్లలో ఎస్సైలు జెండా ఆవిష్కరించారు. మండల పరిషత్లో ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగరవేశారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించారు.
News January 26, 2026
KNR: TNGOs భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

కరీంనగర్ TNGOs భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGOs నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
News January 26, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ₹2,450 పెరిగి రూ.1,62,710కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ₹2,250 ఎగబాకి రూ.1,49,150 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర ₹69వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


