News January 8, 2026
PDPL: ‘RBSK సిబ్బంది సమయపాలన పాటించాలి’

DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ గురువారం RBSK డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. RBSK డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, రిఫరల్ కేసులు పెంచాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. డా. శ్రీరాములు, డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
UAEపై సౌతాఫ్రికా ఘన విజయం

T20WC: UAEని సౌతాఫ్రికా మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అరబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బ్రెవిస్ 36 పరుగులతో రాణించారు. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని సౌతాఫ్రికా ఇప్పటికే సూపర్-8కి చేరుకోగా UAE టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
News February 18, 2026
నంబులపూలకుంట ఆసుపత్రిలో అధికారుల వాగ్వాదం

సత్యసాయి జిల్లా నంబులపూలకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్యాధికారి ఆనంద్ వర్ధన్, సీహెచ్ఓ నాగలక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గర్భిణీల చికిత్స, సిబ్బంది విధుల కేటాయింపుపై తలెత్తిన విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం కుర్చీలు, ఫైళ్లు విసురుకున్నారన్న ప్రచారం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2026
రాజమండ్రి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జిషీట్!

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా అఛార్జిషీట్తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.


