News January 9, 2026
తూ.గో: సీఎం చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందుకునేది వీరే!

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రాయవరం నుంచి రైతు చంద్రమళ్ల కుమారి, వెదురుబాక నుంచి వీరన్న శెట్టి రాముడును అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన రైతులకు సీఎం నేరుగా కొత్త పుస్తకాలను అందజేయనున్నారు. ఈ పంపిణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News January 12, 2026
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 85 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు. కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 85 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో అత్యధికంగా 35 కేసులు నమోదవగా.. సెంట్రల్ జోన్లో 21, వెస్ట్ జోన్లో 15, ఈస్ట్ జోన్లో 14 కేసులు నమోదయ్యాయి.
News January 12, 2026
అక్షర యోధుడు అలిశెట్టి

కవిత్వంతో ప్రజల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతికొద్ది మంది కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. చిత్రకారుడిగా, ఫొటో గ్రాఫర్గా పని చేస్తూనే కవిగా ఎదిగారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వాలు రాశారు. ‘ఎర్ర పావురాలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’, ‘సిటీలైఫ్’ వంటి కవితా సంకలనాలు రచించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. నేడు ఆయన జయంతి, వర్ధంతి(1956-1993).
News January 12, 2026
ICMR-NIIRNCDలో 45 పోస్టులకు నోటిఫికేషన్

<


