News January 9, 2026

జగిత్యాల: ‘కోర్టులు – పోలీస్ సమన్వయం అత్యవసరం’

image

న్యాయవ్యవస్థను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలంటే కోర్టులు – పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పెండింగ్ క్రిమినల్ కేసులు, చార్జ్‌షీట్ల దాఖలు, సమన్లు, ఎన్‌బీడబ్ల్యూ అమలు, సాక్షుల హాజరు వంటి అంశాలపై చర్చించారు. లోక్‌అదాలత్‌ ద్వారా 1051 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.

Similar News

News February 17, 2026

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

News February 17, 2026

కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న మొదటి పేపర్, 27న రెండో పేపర్, మార్చి 2, 5, 7, 9 తేదీల్లో మిగిలిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొన్నారు.

News February 17, 2026

కాంగ్రెస్‌కు సత్తా లేదు.. బీజేపీతో కుమ్మక్కు: హరీశ్ రావు

image

కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా BRSను ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కు అయిందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు ఒకటై బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయని, ఆ పార్టీల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.