News January 9, 2026
వీఆర్ఓల పనితీరులో మార్పు అవసరం: కలెక్టర్

ఐవీఎస్ సర్వేలో 13 మంది వీఆర్ఓలు కేవలం 50 శాతం మాత్రమే పనితీరు కనబరిచిన నేపథ్యంలో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం లేకుండా, సమయానికి అందించాలని వీఆర్ఓలను ఆదేశించారు. సంబంధిత వీఆర్ఓలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పనితీరులో స్పష్టమైన మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ గంగధర్ గౌడ్ ఉన్నారు.
Similar News
News February 12, 2026
MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్కే: SP

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.
News February 12, 2026
కృష్ణా: పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.. ఏఆర్ సిబ్బందికి శిక్షణ

ఏఆర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్లో భాగంగా మంగినపూడి బీచ్ వద్ద గల ఫైరింగ్ రేంజ్లో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ గురిని పరీక్షించుకున్నారు. విధి నిర్వహణలో ఆయుధాల వినియోగంపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
News February 12, 2026
మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సోపిరాల, కొత్తపాలెం గ్రామాల్లోని దేవాలయాలను సందర్శించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామని, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాఖల సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


