News January 10, 2026
చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.
Similar News
News February 10, 2026
మార్చి 15 లోపు పనులు పూర్తి: చిత్తూరు కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందిన నిధులను మార్చి 15లోగా వినియోగిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్టీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047విజన్ లక్ష్యంలో భాగంగా 10సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈసమావేశంలో కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంతో ఎస్పీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
News February 10, 2026
చిత్తూరు: పథకాలు సాధించడం అభినందనీయం

నెల్లూరు జిల్లాలో గత నెల నిర్వహించిన పారా స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ విభాగంలో జిల్లా దివ్యాంగ క్రీడాకారులు పతకాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. జిల్లా తరఫున మొత్తం 16 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 23 పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు.
News February 10, 2026
చిత్తూరు: పథకాలు సాధించడం అభినందనీయం

నెల్లూరు జిల్లాలో గత నెల నిర్వహించిన పారా స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ విభాగంలో జిల్లా దివ్యాంగ క్రీడాకారులు పతకాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. జిల్లా తరఫున మొత్తం 16 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 23 పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు.


