News January 10, 2026
సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీ

సంగారెడ్డి జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ అయ్యారు. వీరిలో నలుగురు తహశీల్దార్లతోపాటు ఆరుగురు డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు. పలువురు అధికారులను మండలాలు, కలెక్టరేట్ కార్యాలయానికి కేటాయించగా మరికొందరిని ఆర్డీవో కార్యాలయాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 18, 2026
కర్నూలు: 14 మంది విద్యార్థుల డిబార్

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 14 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు తెలిపారు. వీరంతా మంగళవారం జరిగిన పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారని చెప్పారు. KDC, సెయింట్ జోసఫ్, STBC, రావుస్, GDC నంద్యాల, జ్యోతిర్మయి, శ్రీ వేంకటేశ్వర, సిద్ధార్థ, నందరాం, ఆలూరు, సాయిరాం, తదితర కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు.
News February 18, 2026
IFR-ఎప్పుడు ఎక్కడ జరిగింది?

✦2001 ముంబయి: భారత్లో తొలి ఐఎఫ్ఆర్ నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ సమీక్షించారు.
✦2016 విశాఖ: రెండోసారి విశాఖలో జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు.
✦2026 విశాఖ: తాజా ఐఎఫ్ఆర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించనున్నారు.
✦సుమారు 71 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయి.
✦ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రజలకు ప్రత్యేక ఆకర్షణ
News February 18, 2026
పూజ పూర్తయ్యాక ఈ తప్పులు చేస్తున్నారా?

దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.


