News January 10, 2026
VZM: మాజీ సర్పంచ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన MLA

గరివిడి మండలం కోడూరు మాజీ సర్పంచ్ అడప సూర్యనారాయణ మృతిపై అనుమానలు ఉన్నాయని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. కుట్ర కోణం ఏమైనా ఉంటే దర్యాప్తు చేయాలని చీపురుపల్లి పోలీస్ అధికారులకి ఎమ్మెల్యే సూచించారు. రెండు రోజులు క్రితం అదృశ్యమైన సూర్యనారాయణ శుక్రవారం గ్రామ పొలిమేరలోని నీటి కుంటలో శవమై తేలిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులని ఓదార్చి దైర్యం చెప్పారు.
Similar News
News March 5, 2026
ఫైనల్కు ఒక్క అడుగుదూరంలో..

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్తో సెమీస్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ సెమీస్లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్లో భారత్దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News March 5, 2026
నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
News March 5, 2026
మిల్లెట్ మహిమ: 106 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా లక్ష్మమ్మ

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.


