News January 10, 2026
కొయ్యూరు: గమనిక.. 3 రోజులు హైవే రహదారి మూసివేత

కొయ్యూరు మండలంలోని వలసంపేట జాతీయ రహదారిపై అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చింతపల్లి నుంచి కేడీపేట జాతీయ రహదారి మద్యలో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు నిమిత్తం శుక్రవారం నుంచి బుధవారం వరకు వాహన రాకపోకలు నిలిపివేస్తున్నామని హైవే అధికారులు తెలిపారు. ఇటుగా ప్రయాణించే వాహన దారులు గమనించాలని కోరారు
Similar News
News March 20, 2026
నల్గొండ: ఇరుకైన బ్రిడ్జిలు.. ఘోర ప్రమాదాలు

కోదాడ-జడ్చర్ల, నల్గొండ-మాచర్ల హైవేలపై ఇరుకైన వంతెనలు, రక్షణ గోడలు లేకపోవడంతో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల హాలియా సమీపంలో జరిగిన లారీ ప్రమాదంలో కొత్తగూడెం దంపతులు మృతి చెందగా, కంపాసాగర్ వద్ద కారు కాల్వలో పడి మరో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. అధికారులు స్పందించి వంతెనలకు రక్షణ గోడలు నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News March 20, 2026
ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.
News March 20, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్

జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుక్ చేసుకున్న నిర్ణీత గడువులోనే సిలిండర్లు నేరుగా ఇంటికే అందుతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఎక్కడా కొరత లేకుండా పకడ్బందీగా పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వివరించారు.


