News April 25, 2024
పార్వతీపురం: దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీవో విష్ణుచరణ్ తెలిపారు. పి. కోనవలస, భద్రగిరిలో బాలురు, బాలికలు, కురుపాంలో బాలికల కళాశాలలు నడుస్తు న్నాయి. వీటిలో ఎంపీసీలో 200, బైపీసీలో 200 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్నిచోట్ల సీఈసీ, హెచ్ఎసీ గ్రూపులున్నాయని, 40 చొప్పున సీట్లు భర్తీ చేస్తామని పీవో చెప్పారు.
Similar News
News April 21, 2025
విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్ డే

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
News April 21, 2025
తెట్టంగిలో బంగారం చోరీ

గుర్ల మండలంలోని తెట్టంగిలో ఐదున్నర తులాల బంగారం దొంగతనం అయినట్లు ఎస్సై పి.నారాయణ రావు సోమవారం తెలిపారు. తెట్టంగికి చెందిన జమ్ము పాపి నాయుడు ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని చెప్పారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లతో పూర్తి స్థాయిలో పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.
News April 21, 2025
విజయనగరం: కేటగిరీల వారీగా పోస్టులు వివరాలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో డీఎస్సీ ద్వారా 446 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. కేటగిరిలా వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.➤ OC-184 ➤ BC-A:33 ➤ BC-B:43➤ BC-C:3 ➤ BC-D:31 ➤ BC-E:16➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:29➤ SC-గ్రేడ్3:31 ➤ ST:26 ➤ EWS:40 NOTE సజ్జెక్టుల వారీగా వివరాల కోసం ఇక్కడ <<16156073>>కిక్ల్<<>> చేయండి.