News January 10, 2026
సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి!

AP: సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్పై ఫిర్యాదుకు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు(92816 07001)ను సంప్రదించాలంది. 18వ తేదీ వరకు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.
Similar News
News February 10, 2026
బాబ్రీ మసీదు నిర్మాణం జరగదు: UP CM యోగి

బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పటికీ జరగదని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రామ్ లల్లా కోసం వస్తామని, ఆలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఖయామత్ దినం రాదనేది నిజం. అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుంది? దాని గురించి కలలు కనొద్దు’ అని బారాబంకి సభలో అన్నారు. WB ముర్షిదాబాద్లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ లక్నో నుంచి మార్చ్ చేయనున్నట్టు హిందూ సంస్థలు ప్రకటించాయి.
News February 10, 2026
వాస్తుకు లేని స్థలాల్లో ఇల్లు కట్టుకోవచ్చా ?

వాస్తు లేని స్థలంలో ఇల్లు కట్టాల్సి వస్తే, రోడ్డును బట్టి సరైన ప్లాన్ రూపొందించుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటి చుట్టూ 4 వైపులా ఖాళీ స్థలం వదలాలి. గాలి, వెలుతురు ప్రతి గదిలోకి ప్రవహించేలా చూసుకోవాలి. నీటి వసతికి ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా నిర్మించుకోవాలి. వీటితో ఇంటికి జీవశక్తి పెరుగుతుంది. ఆందోళన అనవసరం. ప్రాథమిక సూత్రాలు పాటించడమే అసలైన వాస్తు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 10, 2026
కొడుకు పెళ్లికి రావాలని మోదీకి సచిన్ ఆహ్వానం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంతో PM మోదీని కలిశారు. Mar 5న జరగనున్న కొడుకు అర్జున్ పెళ్లికి ఆయనను ఆహ్వానించినట్లు SMలో సచిన్ తెలిపారు. ‘అర్జున్, సానియా చందోక్ పెళ్లికి మోదీని ఆహ్వానించడం గర్వంగా ఉంది. యంగ్ కపుల్ను ఆశీర్వదించి, విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీ 10 జన్పథ్లోని నివాసంలో సోనియా గాంధీని కలిసి పెళ్లి వేడుకకు ఆహ్వానించారు.


