News January 10, 2026

తిరుపతి: ప్రతి పాఠశాలకు ప్రత్యేకాధికారి..!

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేకాధికారిని నియమించింది. విద్యార్థుల బోధన, చదవడం, పరీక్షలు, పది విద్యార్థుల స్టడీ అవర్స్.. 100 శాతం ఉత్తీర్ణత కోసం వీరి పర్యవేక్షణ ఉంటుంది. పిలల్ల సామర్ధ్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 13,675 మంది, మున్సిపాలిటి పాఠశాలల్లో 972 మంది చదువుతున్నారు.

Similar News

News March 12, 2026

రైతుల ఖాతాల్లో రూ.127.63 కోట్లు జమ: VZM కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం మూడవ విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున అందించనున్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతులకు సుమారు రూ.127.63 కోట్లు జమ కానున్నాయని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ నిధులను రైతులు పంట సాగు అవసరాలకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

News March 12, 2026

సిద్దిపేటలో 109 మొబైల్ ఫోన్లు రికవరీ: సీపీ

image

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిద్దిపేట పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాలతో CEIR పోర్టల్ ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రూ.10 లక్షల విలువైన 109 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ పోయిన వారు www.ceir.gov.in లో నమోదు చేసుకుంటే తిరిగి పొందే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 200 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

News March 12, 2026

NZB: వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు: DMHO

image

ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తికి పాల్పడితే వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని NZB DMHO డా.రాజశ్రీ హెచ్చరించారు. గురువారం నిర్వహించిన గర్భస్త పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీసీపీఎన్‌డీటీలో నమోదు అయిన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని సూచించారు.