News April 25, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

> కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నామినేషన్
> పాల్వంచలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు > కుసుమంచిలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటన
> పార్లమెంటు ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> నేటితో ముగియనున్న నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ గడువు
> మధిరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాక
Similar News
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News April 23, 2025
భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.
News April 23, 2025
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్, ఏలువారిగూడెంలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం నగరం, కల్లూరు మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.