News January 10, 2026

కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహన రద్దీ

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు రావడంతో పట్టణ వాసులు పల్లె బాట పట్టారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాలు కిక్కిరిసాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు క్యూలలో నిలబడ్డారు. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. స్వర్ణ టోల్ ప్లాజా వద్ద 7 ఫాస్ట్ ట్రాక్ లైన్లు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

Similar News

News February 13, 2026

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

image

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్‌ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 13, 2026

RGM: వన్ CI, గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని వినతి

image

ఈనెల 10న గోదావరిఖనికి చెందిన మార్కాపురి తిలక్ న్యాయవాదిపై వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి అనుచిత ప్రవర్తన, దాడి చేసిన గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో CIపై చర్యలు తీసుకోవాలని CPని కోరారు. చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరుకామని లాయర్లు పిలుపునిచ్చారు.

News February 13, 2026

సిద్దిపేట: మూడు మున్సిపాలిటీల్లో ‘గులాబీ’ జెండా రెపరెపలు

image

సిద్దిపేట జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన కంచుకోటలను నిలబెట్టుకుంది. గజ్వేల్, చేర్యాల, దుబ్బాకలో స్పష్టమైన మెజారిటీ సాధించి పీఠాలను కైవసం చేసుకుంది. గజ్వేల్‌లో 11, చేర్యాలలో 7 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. హుస్నాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ 16 సీట్లతో విజయదుందుభి మోగించింది. మారిన రాజకీయ సమీకరణాల్లోనూ బీఆర్‌ఎస్ 3 చోట్ల మ్యాజిక్ ఫిగర్ రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.