News January 10, 2026
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: భూపాలపల్లి ఎస్పీ

సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా, పోలీస్ గస్తీని మరింత పటిష్ఠం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News March 20, 2026
నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: గణబాబు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్కు మార్చి 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల దాదాపు 55,000 మందికి ఉపాధి లభిస్తుందని విప్ గణబాబు వెల్లడించారు. 2029 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా, 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్గా మారనుందని ఆయన తెలిపారు.
News March 20, 2026
జనగామ జిల్లాలో పేపర్లెస్ పరిపాలనకు శ్రీకారం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ-ఆఫీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలనలో పారదర్శకత పెంపుతో పాటు సేవలను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించారు. ఫైళ్లను ఆన్లైన్లో నిర్వహించడం ద్వారా నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
News March 20, 2026
ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

మార్చి 21న ప్రభుత్వం రంజాన్గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.


