News January 10, 2026

పట్టిసీమలో కోడిపందేల బరులు ధ్వంసం

image

సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘా పెంచింది. శనివారం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టిసీమలో కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పండుగ ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు అతిక్రమించకూడదని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.

Similar News

News March 18, 2026

RR: వారికి డబుల్ బెడ్ రూమ్‌ రద్దు చేయండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.

News March 18, 2026

రైలు నుంచి జారిపడి మణుగూరు వ్యక్తి మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య(48) మృతి చెందారు. గుర్తుతెలియని రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోదరుడు మోహన్రావుకు అప్పగించారు.

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (1/2)

image

నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన వేళ మరోసారి మహిళా ఓటర్ల డామినేషన్ చర్చనీయాంశమైంది. 2025 బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఉమెన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అస్సాంలో 1.25Cr (49.97%), బెంగాల్‌లో 3.16Cr (49%), TNలో 2.89Cr (51.07%), కేరళంలో 1.38Cr (51%), పుదుచ్చేరి 5.3లక్షలు (53%) మహిళా ఓటర్లు ఉన్నారు.