News January 10, 2026
అంబేడ్కర్ కోనసీమ: ‘రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి’

ఆరోగ్యవంతమైన కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం, ఉద్యాన శాఖ సహకారంతో కృషి కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మిద్దె తోటల పెంపకానికి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో అడ్డాల గోపాలకృష్ణ తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుందని, ఆసక్తి గలవారు రూ.3,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 12, 2026
నల్గొండ: రెండు రెట్లు పెరిగిన వాహనాల రద్దీ

సంక్రాంతి వేళ 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ రోజుల కంటే రెండు రెట్లు అధికంగా వాహనాలు వస్తుండటంతో చౌటుప్పల్, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, టోల్ నిర్వాహకులు అదనపు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణ సమయం పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు.
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News January 12, 2026
సిరిసిల్ల: ప్రజావాణికి 122 దరఖాస్తుల స్వీకరణ

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి 122 దరఖాస్తులు వచ్చాయి. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


