News January 11, 2026

ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో రాజముద్రతో ఉన్న 9,134 పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఏలూరు డివిజన్‌లో 5,501, జంగారెడ్డిగూడెంలో 3,614, నూజివీడులో 90 పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలిదిండి మండలంలో అత్యధికంగా ఉన్నాయని, జాప్యం లేకుండా వీటిని పంపిణీ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

Similar News

News March 16, 2026

OTD: సచిన్ శతకాల ‘సెంచరీ’ చేసిన వేళ!

image

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 14 ఏళ్లు. 2012 మార్చి 16న సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు కొట్టిన తొలి, ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 114 పరుగులతో ఈ ఘనత అందుకున్నారు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకపోవడం గమనార్హం. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(85) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.

News March 16, 2026

నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

image

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.

News March 16, 2026

9/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

image

ఉగ్రదాడికి ఎప్‌స్టీన్ నెట్‌వర్క్ కుట్ర పన్నిందని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలిన సభ్యులు USలో 9/11 తరహా ఘటనను క్రియేట్ చేసి, దానికి ఇరాన్‌ను నిందించాలని ప్లాన్ చేసినట్లు విన్నాను. మేం ఇలాంటి వాటికి వ్యతిరేకం. మా యుద్ధం US ప్రజలతో కాదు’ అని ట్వీట్ చేశారు. 2001 SEP 11న న్యూయార్క్‌ ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన దాడిలో 3వేల మంది చనిపోయారు.