News January 11, 2026
కోనసీమ వాసు కార్టూనిస్ట్ రాముకు అరుదైన ఘనత

కోనసీమ వాసికి అరుదైన ఘనత దక్కిందని ఏపీ కార్టూనిస్టుల సంఘం తెలిపింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సు సమీపంలో ఫ్లేమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వ్యంగ్య చిత్రకళా ప్రదర్శనలో అమలాపురం రూరల్ బండారులంక గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము పర్యావరణ రక్షణ, వన్యప్రాణుల, వృక్ష సంపద ఆవశ్యకత అంశంపై గీసిన కార్టూన్ ప్రదర్శనకు ఈ అర్హత సాధించింది.
Similar News
News February 14, 2026
కార్పొరేషన్లలో ‘కారు’ డౌన్

TG: మున్సిపాలిటీల్లో సుమారు 13 చోట్ల గెలిచిన BRS.. కార్పొరేషన్లలో మాత్రం డీలా పడిపోయింది. 7 చోట్ల ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. మొత్తం 414 డివిజన్లలో 63 చోట్ల మాత్రమే విజయం సాధించింది. NZBలో 60 డివిజన్లు ఉండగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెంలో మూడో స్థానానికి పరిమితమైంది. పంచాయతీ ఎన్నికల్లో కాస్త ఫర్వాలేదనిపించినా నగర ప్రజలు పక్కనబెట్టినట్లు అర్థమవుతోంది.
News February 14, 2026
కూలి కూటికిరాదు, లేకి చేతికిరాదు

వ్యవసాయం, వ్యాపారం ఏదైనా అన్ని పనులకూ కూలీల మీదే ఆధారపడితే చేతికి వచ్చే లాభం కూలీలకే సరిపోతుంది. యజమానికి కనీసం తిండికి కూడా మిగలదు. అందుకే సాధ్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకోవాలి. అలాగే ఇతరులకు పని అప్పగించేటప్పుడు నిర్లక్ష్యం, బాధ్యత లేనివారికి అప్పగిస్తే, ఆ పని పూర్తికాదు సరికదా, ఆశించిన ఫలితం మన చేతికి అందదు. అందుకే పని అప్పగించినా మన పర్యవేక్షణ తప్పక ఉండాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 14, 2026
కర్నూలు: ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో మోసం..వ్యక్తి అరెస్టు

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసిన ఊటూపల్లి మహేంద్రబాబును కర్నూలు 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు పంపించి పలువురిని మోసం చేసినట్టు వారు తెలిపారు. గతంలో పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేసులోనూ అతనిపై కేసు నమోదై ఉందన్నారు. ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.


