News January 11, 2026
ఈనెల 15 నుంచి 22 వరకు సింగోటం బ్రహోత్సవాలు

కొల్లాపూర్ మండలంలోని సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహోత్సవాలు ఈనెల 15 నుంచి 22 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్వయంభు లింగ రూపంలో విగ్రహం ఉండటంతో లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంగా పేరు పొందింది. రెండో యాదాద్రిగా పిలవబడుతున్న ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో జటప్రోలు సంస్థాన రాజు సురభి నర్సింగ భూపాలుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
Similar News
News March 13, 2026
రాష్ట్రాలకు శుభవార్త.. భారీగా నిధులు

AP సహా 6 రాష్ట్రాలు/UTకి ₹1,913Cr అదనపు నిధుల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. 2025లో వరదలు, మొంథా తుఫాను నష్టానికి సాయంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గుజరాత్కు ₹778Cr, APకి ₹341Cr, J&Kకు ₹330Cr, HPకి ₹288Cr, నాగాలాండ్కు ₹158Cr, ఛత్తీస్గఢ్కు ₹15Cr అందనున్నాయి. FY26లో SDRF కింద 28 రాష్ట్రాలకు ₹20,735Cr, NDRF కింద 21 రాష్ట్రాలకు ₹3,628Cr రిలీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
News March 13, 2026
విజయవాడలో ప్రమాదం.. MBBS విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2026
సిద్దిపేట: ‘లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి’

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు.


