News January 11, 2026

విశాఖలో ఉప లోకాయుక్త క్యాంప్ సిట్టింగ్‌

image

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీ ఉప లోకాయుక్త పి.రజని ఆధ్వర్యంలో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఈ క్యాంప్‌లో పాల్గొని ప్రభుత్వ అధికారుల అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కొత్త ఫిర్యాదులు అందజేయవచ్చునని ఆమె తెలిపారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 5, 2026

నెలకు రూ.40వేల జీతం.. ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

ముంబై పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News March 5, 2026

సచిన్‌లాగే అర్జున్.. వయసులో పెద్ద అమ్మాయితో వివాహం!

image

సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఈరోజు ముంబైలో జరగనుంది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన సానియా చందోక్‌ను ఆయన పెళ్లాడనున్నారు. సానియా కంటే అర్జున్ ఒక సంవత్సరం చిన్నవాడు కావడం గమనార్హం. అర్జున్ 1999 SEP 24న, సానియా 1998 జూన్ 23న జన్మించారు. ఈ నేపథ్యంలో వీరి వయసు వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. కాగా అర్జున్ పేరెంట్స్ సచిన్(52), అంజలి(58) మధ్య వయసు తేడా ఆరేళ్లు. 1995లో వారికి వివాహమైంది.

News March 5, 2026

విజయవాడలో IAS అని నమ్మించి.. రూ.10 లక్షల మోసం

image

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ కానూరుకు చెందిన నాగమణిని మురళి అనే వ్యక్తి భారీగా మోసం చేశాడు. తాను ఐఏఎస్ అధికారిగా సెలక్ట్ అయ్యానని నమ్మించి, పలు దఫాలుగా ఆమె నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో బాధితురాలు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మురళిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.