News April 25, 2024

కావలి: సచివాలయ ఉద్యోగి సస్పెండ్

image

కావలి పట్టణం బుడంగుంటలోని 15వ వార్డు సచివాలయ అడ్మిన్ పెంచల బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. సచివాలయ తాళాలు ఉండే సదరు ఉద్యోగిని ఇందుకు బాధ్యుడిగా చేస్తూ సస్పెండ్ చేశారు. విచారణ ముగిసి తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇది కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో చైనా మాంజాలు నిషేధం: SP

image

నెల్లూరు జిల్లాలో చైనా మాంజా వాడకాన్ని నిషేధిస్తున్నామని ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల వెల్లడించారు. ‘సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. అందరూ సంతోషంగా పతంగులు ఎగరవేయాలి. చైనా మాంజా(దారం) వాడకంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారాలు అమ్మడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఆ మాంజాను విక్రయిస్తే 100కు డయల్ చేయండి’ అని ఎస్పీ కోరారు.

News January 13, 2026

నెల్లూరు ఎస్పీ హెచ్చరికలు ఇవే..!

image

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, అందులో పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. ఎక్కడైనా కోడి పందెం, జూద శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని ఆమె కోరారు.

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో MROలు పట్టించుకోవడం లేదు..!

image

అనంతసాగరం లింగంగుట్టలో 2022లో రీసర్వే చేసి 1B భూములను చుక్కల భూములుగా తేల్చారు. 114మందికి చెందిన భూములను ఒకే వ్యక్తి కిందకు చేర్చారు. బాధితులకు 1బీ అడంగల్ అందక, రిజిస్ట్రేషన్లు జరగక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నెల్లూరులో సోమవారం JCకి అర్జీ ఇవ్వగా.. వీటిని MRO, RDO లాగిన్‌లోనే చేయాలని చెప్పారు. MRO, RDOలకు ఈ అంశంలో ఫుల్ పవర్స్ ఇచ్చినా బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.