News January 11, 2026
కామారెడ్డి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో డిమాండ్ ఉన్నప్పటికీ, గత వారం ధరలనే వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ రూ. 800, చికెన్ రూ. 300 విక్రయిస్తుండగా.. లైవ్ కోడి ధర రూ. 200గా ఉంది. పండుగ సమీపిస్తుండటంతో చికెన్ సెంటర్ల వద్ద మాంసం ప్రియుల సందడి పెరిగింది.
Similar News
News February 16, 2026
ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం(ఫొటోలో)
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త, Ex MP లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు
News February 16, 2026
కరీంనగర్ బల్దియాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర సేవలను నిలిపివేశారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
News February 16, 2026
UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.


