News January 11, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ.300-రూ.320గా ఉంది. విజయవాడలో రూ.300, గుంటూరులో రూ.290, నంద్యాల జిల్లాలో రూ.240-రూ.280, కామారెడ్డిలో రూ.300, వరంగల్లో రూ.300కి విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News February 23, 2026
INC: అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు

ప్రతిపక్షంగా NDAపై పోరాడాల్సిన INC అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో సిద్దరామయ్య, శివకుమార్ల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఝార్ఖండ్లో JMMతోనూ విభేదాలున్నాయి. అస్సాం, బిహార్లలో సీనియర్ నేతలు భూపేన్ కుమార్, షకీల్ అహ్మద్ రాజీనామా చేశారు. WBలో ఉనికి కోల్పోగా, GJ, UPలోనూ అదే స్థితికి చేరుతోంది. TNలో సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు. అటు కేరళలోనూ ఇంటర్నల్ విభేదాలున్నాయి.
News February 23, 2026
ఎండల్లో వర్షాలు.. పొంచి ఉన్న జ్వరాల ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పగటిపూట ఎండలు దంచికొడుతుండగా రెండ్రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇలా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తాజా ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
News February 23, 2026
మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.


