News April 25, 2024
రూ.60 లక్షల జీతం.. కక్కుర్తి పడితే ఇలాగే ఉంటది మరి!!

తిండి కోసం కక్కుర్తి పడిన భారత సంతతి వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు. మెహుల్ ప్రజాపతి కెనడాలోని టీడీ బ్యాంకులో డాటా సైంటిస్టుగా పని చేస్తున్నాడు. సంవత్సరానికి రూ.60 లక్షల జీతం. అయితే ఇతడు యూనివర్సిటీల్లో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఫుడ్ బ్యాంకుల నుంచి పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలు వాడేసుకునేవాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.
Similar News
News January 29, 2026
కుసుమలో ఆకుమచ్చ తెగులు-నివారణకు సూచనలు

ప్రస్తుతం పెరిగిన మంచు తీవ్రత, వాతావరణంలో 70 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు కుసుమ పంటలో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆకులపై గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను గమనిస్తే లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి తొలిసారి పిచికారీ చేయాలి. మళ్లీ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 29, 2026
కొలంబోకి టికెట్లు బుక్ చేసుకున్న పాకిస్థాన్!

WC కోసం కొలంబో(SL)కు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ కొలంబో వెళ్తోందని ‘టెలికమ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. తమ రిక్వెస్ట్కు ICC నో చెప్పడంతో బంగ్లా WC నుంచి వైదొలిగింది. దానికి మద్దతుగా తాము కూడా బాయ్కాట్ చేసే విషయాన్ని ఆలోచిస్తామని పాక్ చెప్పింది. అయితే తమ పార్టిసిపేషన్పై సోమవారం PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
News January 29, 2026
లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.


